ఓం శ్రీ శరవణ భవాయ నమః
భారతదేశంలో ఎన్నో పురాతన, స్వయంభూ క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో పవిత్ర గోదావరి నదీ తీరాన వెలిసిన అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం.. పశ్చిమ గోదావరి జిల్లాలోని నడుపూడి (నది-పూడి) గ్రామంలో కొలువైన శ్రీ స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ పుణ్యక్షేత్రం యొక్క సంపూర్ణ స్థల పురాణం, స్వామివారి లీలలు ఈ వ్యాసంలో తెలుసుకుందాం.
| ఆలయ నేపథ్యం మరియు నడుపూడి గ్రామ నామ విశిష్టత |
శతాబ్దాల క్రితం, బ్రిటీష్ ప్రభుత్వ కాలంలో సర్ ఆర్థర్ కాటన్ దొర గారు గోదావరి నదిపై బ్యారేజీ నిర్మించకముందు.. ఈ ప్రదేశంలో పశ్చిమ గోదావరి నది విపరీతమైన పరవళ్ళు తొక్కుతూ, వేగంగా ప్రవహిస్తూ ఉండేది. ప్రతి సంవత్సరం వచ్చే గోదావరి నదీ ప్రవాహ వేగానికి ఇక్కడ 'నది-పూడి' (నది పూడిపోవడం వల్ల) ఏర్పడింది. కాలక్రమేణా ఈ ప్రాంతం "నడుపూడి" గ్రామంగా వాడుకలోకి వచ్చింది.
స్వామివారి ఆగమనం – స్థల పురాణం
పురాణ ప్రసిద్ధి చెందిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు నాసికా త్రయంబకం నుండి గోదావరి నదిలో ప్రయాణం చేస్తూ, తనకు అనుకూలమైన ప్రదేశం కోసం అన్వేషిస్తున్నారు నిత్యము ఋషుల తపస్సులు, పండితుల వేద ఘోషలతో పవిత్రంగా వెలిగిపోతున్న ఈ గోదావరి నది ఒడ్డున గల నడుపూడి క్షేత్రానికి స్వామివారు చేరుకున్నారు.ఆ తర్వాత స్వామివారు ఇక్కడి ఒక భక్తునికి స్వప్నంలో (కలలో) కనిపించి.. తనకు గ్రామోత్సవం జరిపించాలని, ఆ ఉత్సవ పల్లకి గ్రామంలో ఎక్కడైతే స్థిరంగా ఆగిపోతుందో, అక్కడే తనను ప్రతిష్టించాలని ఆజ్ఞాపించారు.
స్వామివారి కోరిక ప్రకారం, గ్రామస్తులు అరటి డొక్కలతో అందమైన పల్లకిని తయారు చేసి, స్వామివారిని గ్రామంలో ఊరేగించారు. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రజెంట్ ఆలయం ఉన్న ఈ ప్రదేశంలోకి రాగానే ఆ పల్లకి భారమై అక్కడే నిలిచిపోయింది. దాంతో గ్రామస్తులు స్వామివారి మహిమను గ్రహించి, అక్కడే అద్భుతమైన ఆలయాన్ని నిర్మించి తమ భక్తి తత్వాన్ని చాటుకున్నారు. అప్పటి నుండి స్వామివారు ఇక్కడ స్వయంభూ మూర్తిగా కొలువై ఉన్నారు.
ఆలయ గర్భగుడిలోని రహస్యం మరియు విశిష్టత
ఈ క్షేత్రంలో ఒక అద్భుతమైన విశేషం ఉంది. స్వామివారి గర్భగుడిలో తూర్పు వైపున ఉన్న ద్వారబంధం పైన, లోపలి వైపు స్వామివారి సహజసిద్ధమైన పుట్ట ఉంది. ఈ పుట్టను ఎవరూ నిర్మించలేదు. స్వామివారు ఈ పుట్టలోనే నిత్యము కొలువై ఉంటారని భక్తుల నమ్మకం. భక్తులు ఈ పుట్టను దర్శించుకునేందుకు వీలుగా ఆలయంలో ఒక ప్రత్యేకమైన అద్దాన్ని (Mirror) కూడా ఏర్పాటు చేశారు.క్షేత్ర మహిమ – పూజా ఫలాలు
నడిపూడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందారు. భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకునే భక్తులకు కింది ఫలితాలు కలుగుతాయని శాస్త్ర సమ్మతంగా నమ్ముతారు:- ఆరోగ్య ప్రాప్తి: శారీరక లోపాలు, చెవుడు మరియు ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది.
- దోష నివారణ: వివిధ గ్రహ దోషాలు, ముఖ్యంగా తీవ్రమైన కుజదోషాలు ఉన్నవారు స్వామివారిని దర్శించి పూజలు చేయించుకుంటే దోషాలన్నీ పటాపంచలు అవుతాయి.
- శీఘ్ర వివాహం: వివాహం కాక ఇబ్బంది పడుతున్న వారికి స్వామివారి అనుగ్రహంతో వెంటనే వివాహం జరుగుతుంది.
- సంతాన, ఐశ్వర్య ప్రాప్తి: స్వామివారి కృపతో భక్తులకు సకల ఐశ్వర్యాలు, సంతాన ప్రాప్తి కలుగుతాయి.
ఆలయ పునర్నిర్మాణం (జీర్ణోద్ధరణ)
కాలక్రమేణా ఈ క్షేత్రం మరింత అభివృద్ధి చెందింది. 1973 వ సంవత్సరంలో ఈ ఆలయ ஜீర్ణోద్ధరణ కార్యక్రమము చాలా వైభవంగా జరిగింది. ఆ సమయంలోనే ఆలయంలో శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల ఉత్సవ విగ్రహాల ప్రతిష్ట కూడా శాస్త్రోక్తంగా నిర్వహించబడింది. (ప్రస్తుతం ఈ స్వామివారి చరిత్ర హక్కులన్నీ దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెంది ఉన్నాయి).
గోదావరి నది పరవళ్ళ మధ్య స్వయంభూగా వెలిసిన నడుపూడి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్రం ప్రతి ఒక్కరూ దర్శించదగిన పావన భూమి. మీ జీవితంలో కూడా కుజదోషాలు లేదా వివాహ సమస్యలు ఉంటే, ఒకసారి నడుపూడి క్షేత్రాన్ని దర్శించి స్వామివారి కృపకు పాత్రులు అవ్వండి.
ఓం శరవణభవ!





Comments
Post a Comment